అయితే, జగన్ రెడ్డి ఒక్కసారిగా మీడియా ముందుకొచ్చి పార్టీ శ్రేణుల ప్రచారానికి పూర్తి భిన్నంగా మాట్లాడారు. "గూగుల్ డేటా సెంటర్ను తాము స్వాగతిస్తామని, అది మంచిదేనని, దాని క్రెడిట్ తమకూ కావాలి" అంటూ ప్రకటించారు. పరువు పోగొట్టుకున్న అమర్నాథ్: పార్టీ చెప్పిన స్టాండ్ను నమ్మి, దానికి అనుగుణంగా వ్యతిరేక ప్రచారం చేసి, చివరికి జగన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్తో దాన్ని ఖండించడం గుడివాడ అమర్నాథ్ పరువు పూర్తిగా పోగొట్టింది. అమర్నాథ్ను అపహాస్యం చేస్తూ, "కోడిగుడ్డు మంత్రి" అని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న ప్రత్యర్థులకు ఇప్పుడు జగన్ రెడ్డి మాటలు మరింత బలాన్నిచ్చాయి. సొంత పార్టీ అధినేతే తనతో అలా మాట్లాడించి, ఆ తర్వాత తానే దాన్ని కొట్టిపారేసినట్లుగా వ్యవహరించడంపై అమర్నాథ్ అభిమానులు కూడా కంగుతిన్నారు.
అస్పష్టమైన నాయకుడిని నమ్ముకుంటే ఇదే గతి! .. "జగన్ రెడ్డి లాంటి క్లారిటీ లేని నాయకుడ్ని, క్లారిటీ లేని విధానాలు ఉన్న పార్టీని నమ్ముకుంటే ఇలాగే 'బకరా' అయిపోతారు" అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా ఆవేశపడి, పార్టీ వాయిస్గా మాట్లాడి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ తానే అటూ ఇటూ కాకుండా పోయారు. తను మాట్లాడిన వ్యాఖ్యలు పార్టీ తరఫున కాదని, తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని చెప్పుకుని ఇప్పుడు సర్దుకునే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. ఏదేమైనా, ఈ గూగుల్ డేటా సెంటర్ వ్యవహారంలో జగన్ రెడ్డి తీరు.. అమర్నాథ్ను, వైసీపీ సోషల్ మీడియాను పూర్తిగా గందరగోళంలోకి నెట్టిందనేది నిర్వివాదాంశం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి