నెల్లూరు జిల్లా మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల బారిన పడింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిని చేరాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షం నమోదవుతుంది. ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈ రోజు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని సూచించారు.

కృష్ణాపట్నం పోర్టు ప్రాంతంలో అధికారులు ఐదవ స్థాయి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతూ సముద్రం ముందుకు వచ్చి పలు చోట్ల రోడ్లపైకి చేరింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఆదేశాలు అమలు చేస్తున్నారు. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని అవసరమైన చోట సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సన్నాహాలు చేశారు.

జిల్లా వ్యాప్తంగా చలిగాలులు వీస్తూ ప్రతి క్షణం ముప్పు రావచ్చన్న ఆందోళన నెలకొంది. సోమశిల కండలేరు రాళ్ళపాడు జలాశయాలు నిండుకుండలుగా మారాయి. పెన్నా నదికి నీటిని విడుదల చేయడం జరిగింది.పెన్నా సంగం బ్యారేజీల వద్దకు భారీగా నీరు చేరుతోంది. అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు హెచ్చరికలు పాటించి సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అప్రమత్తత అవసరం. ప్రజలు హెచ్చరికలు పాటించి సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అప్రమత్తత అవసరం.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: