ఈసారి కూడా అభిమానులు తమ ఉత్సాహాన్ని అదుపు చేసుకోలేకపోయారు. కోర్టు పరిసరాల్లో గుంపులుగా చేరి నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. పోలీసులు చివరి దశలో ర్యాలీని అడ్డుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ జనసామూహిక ప్రదర్శనను ఆపడం కష్టమైంది. జగన్ వాహనం వెళ్తుండగా అభిమానులకు అభివాదం చేస్తూ లోటస్ పాండ్ వైపు వెళ్లిపోయారు. ఆయనను అనుసరించే అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ముందుకు కదిలారు. ఇలాంటి ర్యాలీలు, పోస్టర్లు, రాజకీయ సందేశాలు కోర్టు హాజరు నేపథ్యంలో రావడం అనేక విమర్శలకు దారితీసింది.
జగన్ ప్రజాదరణను చూపించడానికి ఆయన అనుచరులు కావాలనే బలం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు రాజకీయ విశ్లేషకులు దీనిని కోర్టు హాజరు అవసరం లేకపోవచ్చని ఒత్తిడి సృష్టించే ప్రయత్నంగా కూడా చర్చించుకున్నారు.ఏది ఏమైనా… న్యాయస్థానానికి హాజరవుతున్న సందర్భంలో ఇలాంటి అతిశయ ప్రదర్శనలు జరగడం సరికాదని న్యాయవాదులు, రాజకీయులు వ్యాఖ్యానిస్తున్నారు. అభిమానుల భావోద్వేగం అర్థమయ్యే అంశమే కానీ, కోర్టుల ముందు ఈ రకం పోస్టర్లు, సినిమా డైలాగులు ప్రదర్శించడం సరికాదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి