
ముఖ్యంగా కాకతీయ చక్రవర్తులు గణపతి దేవుడు , భద్రకాళి అమ్మవారిని తమ కుల దేవతగా ఆరాధించేవారు .. ఈ ఆలయం 12వ శతాబ్దంలో కాకతీయ రాజులచే నిర్మించబడింది .. ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం అప్పట్లో గోల్కొండ గనుల నుంచి వెలికి తీశారని , కాకతీయులు దాన్ని సేకరించి భద్రకాళి అమ్మవారి విగ్రహానికి అలంకరించారని అంటూ ఉంటారు . క్రీ. శ. 1323లోఢిల్లీ సుల్తానేట్ పాలకుడు ఘియాత్ అల్-దిన్ తుగ్లక్ (అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫూర్ దండయాత్ర) కాకతీయ సామ్రాజ్యం పై దండెత్తి,ఓరుగల్లు ను ఆక్రమించుకున్నాడు .. ఆ సమయంలో కోహనూర్ వజ్రాన్ని భద్రకాళి ఆలయం నుంచి తీసుకొని ఢిల్లీకి ఎత్తుకుపోయారని అంటారు ..
ఇక ఆ తర్వాత ఈ వజ్రం ఎంతోమంది పాలకుల చేతులు మారుతూ మొఘలులు , పర్షియన్లు , ఆఫ్ఘన్లు , సిక్కులు , ఇక చివరకు బ్రిటిష్ వారి వశం అయ్యింది . ఇక ప్రస్తుతం కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాజ కిరీటంలో ఒక భాగంగా ఉంది .. అయితే వరంగల్ భద్రకాళి ఆలయంలో ఇప్పుడు ఈ వజ్రం లేదు . కానీ ఆ కోహినూర్ వజ్రం ఒకప్పుడు అమ్మవారి కంటిలో అలంకరించబడిందని నమ్మకం కథనం ఇప్పటికే సజీవంగా మెదులుతూనే ఉంది .. అలాగే ఈ కథనం ఆలయ చరిత్రకు , వజ్ర చరిత్రకు ఒక ఆధ్యాత్మిక చరిత్రగా ఎవరికి తెలియని చారిత్రిక మిస్టరీని కల్పిస్తుంది .