తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయానికి , కోహనూర్ వజ్రానికి మధ్య ఓ విడదీరాని లోతైన చారిత్రిక సంబంధం ఉందని ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది .. ఇక ఈ సంబంధం కేవలం ఒక కథనం మాత్రమే కాదు , స్థానికంగా బలంగా నమ్మే ఒక పురాణ చరిత్ర .. ఈ కథనాలకు ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేకపోయినప్పటికీ, వరంగల్ భద్రకాళి అమ్మవారు , కోహినూర్  వజ్రం మధ్య విడదీరాని సంబంధం కొన్ని తరాలుగా ప్రచారంలో ఉంది . మనకు తెలిసిన చారిత్రిక కథనాల ప్రకారం , కోహినూర్ వజ్రం ఒకప్పుడు వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహం ఎడమ కన్నుగా ఉండేదట . ..
 

ముఖ్యంగా కాకతీయ చక్రవర్తులు గణపతి దేవుడు , భద్రకాళి అమ్మవారిని తమ కుల దేవతగా ఆరాధించేవారు .. ఈ ఆలయం 12వ శతాబ్దంలో కాకతీయ రాజులచే నిర్మించబడింది .. ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం అప్పట్లో గోల్కొండ గనుల నుంచి వెలికి తీశారని , కాకతీయులు దాన్ని సేకరించి భద్రకాళి అమ్మవారి విగ్రహానికి అలంకరించారని అంటూ ఉంటారు . క్రీ. శ. 1323లోఢిల్లీ సుల్తానేట్ పాలకుడు ఘియాత్ అల్-దిన్ తుగ్లక్ (అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫూర్ దండయాత్ర)  కాకతీయ సామ్రాజ్యం పై దండెత్తి,ఓరుగల్లు ను ఆక్రమించుకున్నాడు .. ఆ సమయంలో కోహనూర్ వజ్రాన్ని భద్రకాళి ఆలయం నుంచి తీసుకొని ఢిల్లీకి ఎత్తుకుపోయారని అంటారు ..


ఇక ఆ తర్వాత ఈ వజ్రం ఎంతోమంది పాలకుల చేతులు మారుతూ మొఘలులు , పర్షియన్లు , ఆఫ్ఘన్‌లు , సిక్కులు , ఇక చివరకు బ్రిటిష్ వారి వ‌శం అయ్యింది . ఇక ప్రస్తుతం కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాజ కిరీటంలో ఒక భాగంగా ఉంది .. అయితే వరంగల్ భద్రకాళి ఆలయంలో ఇప్పుడు ఈ వజ్రం లేదు . కానీ ఆ  కోహినూర్ వజ్రం  ఒకప్పుడు అమ్మవారి కంటిలో అలంకరించబడిందని నమ్మకం కథనం ఇప్పటికే సజీవంగా మెదులుతూనే ఉంది .. అలాగే ఈ కథనం ఆలయ చరిత్రకు , వజ్ర‌ చరిత్రకు ఒక ఆధ్యాత్మిక చరిత్రగా ఎవరికి తెలియని చారిత్రిక మిస్టరీని కల్పిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: