టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇటీవలే ఆస్ట్రేలియా లో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని భారత జట్టు లో చేరాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ జనవరి 7వ తేదీన జరగబోయే మూడో మ్యాచ్లో భారత జట్టులో  కలవనున్నాడు. అయితే ఐపీఎల్లో గాయం బారినపడిన రోహిత్ శర్మ ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాలేదు అన్న విషయం తెలిసిందే. దీంతో బిసిసిఐ పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో వెనక్కి తగిన బీసీసీఐ.. రోహిత్ శర్మను టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ నుంచి రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా బయల్దేరి జట్టులో చేరుతాడు అని అందరూ అనుకున్నారు.


 కానీ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నా రోహిత్ శర్మ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో మరింత కాలం పాటు ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్కు అందుబాటులో ఉంటాడ ఉండడా  అనే అనుమానం కూడా కలిగింది అయితే ఇటీవలే పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించిన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా బయల్దేరాడు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అక్కడ రెండు వారాల పాటు క్వారంటైన్ లో గడిపాడు అన్న విషయం తెలిసిందే...


 14 రోజుల క్వారంటైన్ తరువాత ఇటీవలే జట్టు లో చేరాడు టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ. అయితే మూడో మ్యాచ్లో ప్రస్తుతం భారత జట్టులో ఆడనున్నాడు అన్నది తెలుస్తుంది.  అయితే ప్రస్తుతం సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ జట్టు లో చేరడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. రోహిత్ శర్మ గాయం బారిన పడడంతో కేవలం ఒక గదికి మాత్రమే పరిమితం అయ్యాడు అని.. ఇక క్వారంటైన్ లో కూడా ఎలాంటి ప్రాక్టీస్ చేయడానికి కుదరలేదని..  ఇక ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మైదానంలోకి దిగితే బాగా రాణించే అవకాశం లేదని అందుకే కొన్ని రోజులపాటు రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేయాలి అని ప్రస్తుతం ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా జనవరి 7వ తేదీన జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ ప్రాక్టీసు ప్రారంభించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: