ఐపీఎల్ లో ఒక్కో మ్యాచ్ జరుగుతున్న కొద్దీ అన్ని జట్ల బలాబలాలు బయట పడుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు పూర్తి కాగా, అన్నీ కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ముంబై పిచ్ లు పూర్తిగా బ్యాటింగ్ కు సహకరిస్తుండడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పాలి. అన్ని జట్లు కొత్త ప్లేయర్ లతో ఉత్సాహంగా ఉన్నాయి. ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ముందు కొందరు ప్లేయర్ లు వివిధ కారణాలతో తాము ఆడడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వేలంలో కొనుగోలు చేసిన తర్వాత ఇలా జరగడం నిజంగా ఆయా జట్ల దురదృష్టం అని చెప్పాలి. అయితే తాజాగా తెలుస్తున్న ప్రకారం మరో స్టార్ ప్లేయర్ ఐపిఎల్ సీజన్ 15 కు దూరం అవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆస్ట్రేలియా కు చెందిన ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ను ఢిల్లీ క్యాపిటల్ 6.5 కోట్ల మొత్తానికి ఫిబ్రవరి లో జరిగిన మెగా వేలంలో సొంతం చేసుకుంది. ఇంతకు ముందు పలు జట్లకు ఆడిన మిచెల్ మార్ష్ ఎప్పుడూ గాయాల కారణంగా పూర్తి సీజన్ ఆడిన దాఖలాలు లేవు. అయితే ఈ సీజన్ అయినా ఆడతాడని భావించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. ప్రస్తుతం మార్ష్ గాయంతో బాధపడుతున్నాడు. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే మిచెల్ మార్ష్ ఈ ఐపిఎల్ సీజన్ కు కూడా దూరం కానున్నాడు.

ఇది నిజంగా ఢిల్లీ జట్టుకు బ్యాడ్ న్యూస్. అయితే ఇతని స్థానంలో ఎవరిని భర్తీ చేయనున్నారో తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి మంచి ఊపుమీదుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: