అయితే ఇటీవలే మిథాలీ రాజ్ తన రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్ బ్రాడ్ కాస్ట్ లో ఇటీవలే మాట్లాడుతూ మళ్లీ మైదానం లో దిగుతాను అంటూ సూచనప్రాయం గా వెల్లడించారు. వచ్చే ఏడాది కనుక మహిళ ఐపీఎల్ ప్రారంభం అయితే.. తప్పక తాను బరి లోకి దిగుతా అనుకుంటూ మిథాలీ రాజ్ సూత్రప్రాయం గా చెప్పుకొచ్చింది అని చెప్పాలి. ఐపీఎల్ కోసం రీ ఎంట్రీ ఆప్షన్ ఎప్పుడు ఓపెన్ గానే పెట్టుకుంటాను అంటూ ఇక్కడ వ్యాఖ్యలు చేసింది. అవకాశం వస్తే రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు ఈ విధంగా అటు మిథాలీ రాజ్ స్పందించడం గమనార్హం.
కాగా పురుషుల ఐపీఎల్ తరహా లోనే మహిళల ఐపీఎల్ కూడా నిర్వహించాలని బిసిసీఐ ప్లాన్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఆరు జట్లతో ఇక వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ ప్రారంభించాలని భావిస్తోంది. మరి మిథాలీ రాజ్ చెప్పినట్టుగానే నిజంగానే రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటుందేమో అని అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి అని చెప్పాలి. ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి