ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ 2022 లో చివరి అంకానికి సమయం దగ్గర పడుతోంది. అందులో భాగంగా ఈ రోజు గ్రూప్ 1 లో ఆస్ట్రేలియా మరియు ఆఫ్గనిస్తాన్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ను జస్ట్ ఇప్పుడే పూర్తి చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ తేడాతో గెలవాల్సి ఉండగా, కొద్దిపాటిలో ఓటమిని తప్పించుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ కెప్టెన్ నబీ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా ఫించ్ తప్పుకోవడంతో ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు సారధిగా కీపర్ వేడ్ తన బాధ్యతలను నిర్వర్తించాడు. ఆస్ట్రేలియా ప్లాన్ ప్రకారం భారీ టార్గెట్ ను సెట్ చేసి తక్కువ స్కోర్ కు ఆల్ అవుట్ చేస్తే ఇంగ్లాండ్ కానన మెరుగైన రన్ రేట్ దక్కే అవకాశం ఉంది.

అనుకున్నంత స్కోర్ మాత్రం ఆస్ట్రేలియా చేయడంలో ఫెయిల్ అయింది. ఒక దశలో స్కోర్ 180 దాటుతుందని అనుకుంటే చివరికి నిర్ణీత ఓవర్లలో కేవలం 168 పరుగులు మాత్రమే చేసింది. వార్నర్ కు ఆరంభం దక్కినా బిగ్ స్కోర్ గా మలచలేకపోయాడు, మార్ష్ (45) మరియు మాక్స్ వెల్ (54) లు జట్టుకు ఈ మాత్రం స్కోర్ అయినా రావడంలో హెల్ప్ అయ్యారు. ఇక ఛేదన స్టార్ట్ చేసిన ఆఫ్ఘన్ కు మరోసారి గర్భాజ్ టెర్రిఫిక్ స్టార్ట్ ను ఇచ్చాడు. కానీ స్కోర్ బోర్డు నెమ్మదగినా సాగింది. ముఖ్యంగా ఇబ్రహీం మరియు నైబ్ లు వికెట్లు కాపాడుకున్నా చేయాల్సిన టార్గెట్ ను మరిచిపోయి మరీ నెమ్మదిగా ఆడారు. దీనితోఓవర్ కు 15 పరుగులకు పైగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.  

ఆ సమయంలో రషీద్ ఖాన్ దూకుడుగా ఆడి దాదాపు ఆఫ్ఘన్ ను గెలిపించినంత పనిచేశాడు. చివరికి కేవలం అయిదు పరుగుల దూరంలో ఆఫ్ఘన్ ఆగిపోయింది. రషీద్ ఖాన్ కేవలం 23 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఇతని ఇన్నింగ్స్ లో ఫోర్లు 3 సిక్సర్లు 4 ఉన్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు రషీద్ ఖాన్ వెన్నులో వణుకు పుట్టించాడు. ఇదే దూకుడు మధ్యలో ఇంకెవరైనా ఆడి ఉంటే ఈ రోజు సంచలనం నమోదు అయి ఉండేది.      



మరింత సమాచారం తెలుసుకోండి: