
సౌత్ ఆఫ్రికా వేదికగా జరగబోయే మహిళల టి20 ప్రపంచ కప్ కి ముందు అటు భారత మహిళల జట్టు సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్లతో కలిసి ట్రై సిరీస్ ఆడింది. గ్రూప్ దశలో ఒక్కసారి కూడా ఓడకుండా ఫైనల్ కు చేరుకున్న భారత జట్టు.. తుది పోరులో మాత్రం రానించకుండా చేతులెత్తేసింది. దీంతో రన్నర్ ఆఫ్ గా నిలిచింది. ఇప్పుడే కాదు గత కొన్నేళ్ల నుంచి భారత మహిళల జట్టును కూడా నాకౌట్ ఫోబియా వెంటాడుతోంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం కొన్ని కొత్త పాఠాలను నేర్చుకున్నామని భారత క్రికెటర్లు చెప్పుకొచ్చారు. ఇక అవి సరిదిద్దుకొని టి20 వరల్డ్ కప్ లో అదరగొడతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఒకవేళ టీ20 వరల్డ్ కప్ లో కూడా భారత మహిళలు జట్టు నాకౌట్ ఫోబియాను అధిగమించలేదంటే కప్పు గెలవాలని ఆశలు గల్లంతయినట్లే. ఈ క్రమంలోనే టోర్నీ ప్రారంభానికి ముందు అదరగొడతామని చెప్పి అభిమానుల్లో ఆశలు రేకెత్తించడం... ఇక ఆ తర్వాత టోర్నీ ప్రారంభమయ్యాక చేతులెత్తేయడం అటు పురుషుల జట్టుకు ఇటు మహిళల జట్టుకు అలవాటైన పని అంటూ కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం నిరాశతో కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఫిబ్రవరి 10 నుంచి మహిళల టీ20 ప్రపంచ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 12వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా మొదటి మ్యాచ్ ఆడబోతుంది.