భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పేవారు పెద్దలు . ఎందుకంటే ముక్కు ముఖం తెలియని వారు పెళ్లి అనే బంధంతో ఒక్కటై కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఇక ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కలకాలం కలిసి ఉంటారు. ఇలా శరీరాలు రెండు అయినా మనసు మాత్రం ఒకటే అనే విధంగా భార్యాభర్తల బంధం ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే పెద్దలు చెప్పింది నిజమే అని చాలామంది పెళ్లి చేసుకున్న వారు ఆ తర్వాత బాధపడిన వారు  ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత పెళ్లి అనే మాట వినిపిస్తే చాలు ఉలిక్కి పడుతున్నారు ప్రతి ఒక్కరు.



 అయితే అన్యోన్యతకు చిరునామాగా ఉన్న భార్యాభర్తల బంధం లో నేటి రోజుల్లో ఆ అన్యోన్యత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇక భార్య భర్తలు బద్ధ శత్రువులుగా మారిపోయి ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవడం లాంటివి కూడా చూస్తూ ఉన్నాం. ఏకంగా కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. మరి కొంతమంది కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. ఇలా అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్.



 ఇటీవల వరంగల్లోని కరీమాబాదులో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య కాపురానికి రావడం లేదు అనే కారణంతో భర్త సతీష్ చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని తెలిసి ప్రవర్తన మార్చుకోవాలని చెప్పాడు సతీష్. అయినప్పటికీ భార్య తీరులో మార్పు రాలేదు. దీంతో ఎంతగానో మనస్థాపం  చెందాడు. ఇక భార్య పుట్టింటికి వెళ్లి మళ్లీ తిరిగి రావడం లేదని.. పిల్లలను కూడా తన వద్దకు పంపడం లేదని మనస్థాపానికి గురై చివరికి ఇంట్లో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఇక తన చావుకు భార్య అత్త మామ కారణం అంటూ ఇక సెల్ఫీ వీడియోలో తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: