ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యుత్తమ ప్రస్థానాన్ని కొనసాగించిన భారత జట్టు ఫైనల్ పోరులో మాత్రం ఓడిపోయి నిరాశలో మునిగిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు 2024 టీ20 వరల్డ్ కప్ టార్గెట్గా ప్రస్థానం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా చేతిలో వరల్డ్ కప్ ఓడిపోయిన భారత జట్టు ఇక ఇప్పుడు అదే ఆస్ట్రేలియా తో సొంత గడ్డపై టి20 సిరీస్ ఆడటం ద్వారా 2024 t20 వరల్డ్ కప్ కోసం సాధన షురూ చేసింది.


 ఈ క్రమంలోనే సీనియర్ క్రికెటర్లు అందరికీ కూడా విశ్రాంతి ప్రకటించగా.. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ సారధ్యంలోని యంగ్ టీమ్ ఇండియా ఆస్ట్రేలియా తో తలబడుతుంది. అయితే మొదటి మ్యాచ్ లోనే అద్భుతం చేసి చూపించింది భారత జట్టు. సీనియర్లతో నిండిన ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేసి209 పరుగుల భారీ టార్గెట్ ను టీమిండియా ముందు ఉంచగా.. టీమిండియా వీరోచిత పోరాటం చేసి.. ఈ టార్గెట్ ను చేదించింది. ఈ క్రమంలోనే ఈ లక్ష్య చేదనతో టీమ్ ఇండియా ఒక అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది అని చెప్పాలి.



 అంతర్జాతీయ టి20 లలో 200 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ టార్గెట్ ను అత్యధిక సార్లు చేదించిన జట్టుగా భారత జట్టు నిలిచింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20 లో భారత జట్టు ఐదుసార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు టార్గెట్ ను చేదించింది. ఇటీవల ఆస్ట్రేలియా పై 209 పరుగులు టార్గెట్ ను చేదించడం తో ఈ రికార్డు సృష్టించింది టీమిండియా. ఇక భారత జట్టు తర్వాత ఈ లిస్టు లో సౌత్ ఆఫ్రికా నాలుగు సార్లు, పాకిస్తాన్ మూడుసార్లు, ఆస్ట్రేలియా మూడుసార్లు ఇలా 200 ప్లస్ పరుగులను ఛేదించిన టీమ్స్ గా కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: