ఈ క్రమంలోనే సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇక ఆ సమయం ఎప్పుడు అవుతుందో అని క్రికెట్ అభిమానులు అందరూ కూడా టీవీల ముందు కూర్చుని వేచి చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతూ ఉండగా.. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక ఆసక్తికర ఘటన జరగబోతుంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన ఇద్దరు ప్లేయర్లు ఇలా ఫైనల్ మ్యాచ్లో తలబడబోతున్నారు అని చెప్పాలి.
అయితే ఈ రెండు టీమ్స్ లో ఐపీఎల్ లోనే అత్యధిక ధర పలికిన ఇద్దరు ప్లేయర్లు ఉండడం గమనార్హం. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా కొనసాగుతున్న ప్యాట్ కమిన్స్ గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో 20.5 కోట్ల రూపాయలు ధర పలికాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ హిస్టరీలోనే ఇదే అత్యధిక ధర అని అనుకుంటున్న సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన మరో ఆటగాడు స్టాక్ ర్ 24.5 కోట్లు ధర పలికాడు. ఇక ఇద్దరు కాస్లీ ప్లేయర్లు ఫైనల్ మ్యాచ్లో సై అంటే సై అంటూ తలబడబోతున్నారు.