ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 25 మ్యాచ్ సందర్భంగా RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వార్తల్లోకి ఎక్కాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో కోహ్లీ వాగ్వాదానికి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోహ్లీ ఏదో విషయంపై తన చేతులను చూపిస్తూ కేఎల్ రాహుల్‌తో వాదిస్తున్నట్లు ఆ వీడియోలలో చాలా స్పష్టంగా తెలుస్తోంది. దాంతో సదరు వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే, ఇద్దరి మధ్య సంభాషణ అనేది దేని గురించో స్పష్టంగా తెలియదు. కానీ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ అసహనంగా ఉన్నట్లు అర్ధం అవుతోంది అని నెటిజన్లు అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే కేఎల్ రాహుల్ వద్దకు వెళ్లి అంపైర్ నిర్ణయంపై గొడవకి దిగుతున్నట్టు కనిపిస్తోంది. అయితే, ఆర్‌సీబీ ఛేజింగ్‌లో కీలక పాత్ర పోషించిన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కింగ్ కోహ్లీ కొద్దిసేపటి తర్వాత తిరిగి వెళ్లి బ్యాటింగ్ కొనసాగించడం కొసమెరుపు. ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కేఎల్ రాహుల్ 39 బంతుల్లో 3 ఫోర్లతో అత్యధికంగా 41 పరుగులు చేశాడు. కాగా, ట్రిస్టన్ స్టబ్స్ 18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు సాధించాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఎనిమిది వికెట్లకు 162 పరుగులు చేసింది. ఆర్‌సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత ఈ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా సాధించింది. కోహ్లీ 51 పరుగులు, కృనాల్ పాండ్య 73 పరుగులతో అజేయంగా నిలిచారు.

ఇకపోతే... ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించడంతో... ఆర్‌సీబీ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. బెంగళూరు 10 మ్యాచ్‌ల తర్వాత 14 పాయింట్లను కలిగి ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆ జట్టులో కేఎల్‌ రాహుల్‌ (41) టాప్ ‌స్కోరర్‌ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ.. 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కృనాల్‌ పాండ్య (47 బంతుల్లో 73*; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లీ (47 బంతుల్లో 51; 4 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. దిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీకి ఇది ఏడో విజయం కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: