ఇక గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ అయిన వన్‌ ప్లస్‌- రిలయన్స్‌ జియో కీలక ఒప్పందంని కుదుర్చుకున్నాయి. తమ అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో కూడా 5g సపోర్ట్ ని అందించడానికి రిలయన్స్ జియోతో తన సహకారాన్ని ప్రకటించింది వన్ ప్లస్ కంపెనీ.ఇక భారతీయ వినియోగదారులకు 5g టెక్నాలజీని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఇంకా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో అంతటా తమ 5జీ టెక్నాలజీ సేవలను విస్తరింపజేయడానికి రిలయన్స్‌ జియో ఇంకా వన్‌ప్లస్‌ కంపెనీలు పని చేస్తున్నాయి. ఇంకా అలాగే జియో 5Gకి సపోర్ట్ చేసే వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు జియో ట్రూ 5g నెట్‌వర్క్‌కు యాక్సెస్ ఉన్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌లలో సరికొత్త వన్‌ప్లస్‌ 10 సిరీస్‌, వన్‌ప్లస్‌ 9ఆర్‌, వన్‌ప్లస్‌ 8 సిరీస్, నార్డ్‌, నార్డ్‌ 2టీ, నార్డ్‌ సీఈ2 ఇంకా అలాగే నార్డ్‌ సీఈ2 Lite ఉన్నాయి.ఇంకా అదే విధంగా వన్‌ప్లస్‌9 ప్రో, వన్‌ప్లస్‌ 9 ఇంకా వన్‌ప్లస్‌ ఆర్‌టీ కూడా త్వరలో జియో ట్రూ 5 జీ నెట్‌వర్క్‌కు యాక్సెస్‌ను కలిగి ఉంటాయి.ఇక కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్‌ 13 వ తేదీ నుంచి డిసెంబర్‌ 18 వ తేదీ వరకు వన్‌ప్లస్ వార్షికోత్సవ సేల్‌ అనేది జరగనుంది. ఇందులో భాగంగా జియో ట్రూ 5జీ అందించే మొబైల్‌లలో అద్భుతమైన క్యాష్‌బ్యాక్‌ ని ఇక అందుకోవచ్చు.


ఇంకా అలాగే రూ.10,800 విలువైన క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలు అందుకోవచ్చు. ముందుగా 1000 మంది లబ్దిదారులు అదనంగా కాంప్లిమెంటరీ రెడ్‌ కేబుల్‌ కేర్‌ ప్లాన్‌ను అందుకోవచ్చు.ఇక వీటి విలువ వచ్చేసి రూ.1499, జియో సావన్‌ ప్రో రూ.399 ఉంటుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ లో జియో తన 5జీ ట్రయల్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే.ఇండియాలోని మా కమ్యూనిటీకి 5g టెక్నాలజీని తీసుకురావడానికి జియో టీంకి పార్ట్ నర్ అయినందుకు గర్వంగా ఉందని, ఈ 5g టెక్నాలజీతో వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్‌ సదుపాయంని అందుకోవచ్చని వన్‌ప్లస్‌ ఇండియా సీఈవో ఇంకా ఇండియా రీజియన్ హెడ్ నవనిత్ నక్రా ఒక ప్రకటనలో తెలిపడం జరిగింది. వన్‌ప్లస్‌ మొబైళ్లు జియో ట్రూ5జి యాక్సెస్‌ వన్‌ప్లస్ 9 ప్రో ఇంకా వన్‌ప్లస్ 9 అలాగే వన్‌ప్లస్ 9ఆర్‌టి కూడా త్వరలో జియో ట్రూ 5 జి నెట్‌వర్క్‌కు యాక్సెస్ కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇంకా అలాగే వన్‌ప్లస్ విభాగంలో ఇండియాలో రూ. 20,000, రూ.30,000 ధరలలో5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: