ప్రముక స్మార్ట్ మొబైల్ దిగ్గజ సంస్థలలో రియల్ మీ కూడా ఒకటి.ఇండియన్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్ మొబైల్ ని తీసుకొచ్చింది రియల్ మీ నార్జ్ S-23 పేరుతో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్ మొబైల్ ఈనెల 18వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ మొబైల్ అమెజాన్ ఈ స్మార్ట్ అందుబాటులో రాబోతోంది. తక్కువ బడ్జెట్ తో అదిరిపోయే ఫీచర్స్ తో ఈ స్మార్ట్ మొబైల్ ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే ఈ స్మార్ట్ మొబైల్ బేసిక్ వేరియంట్ మొబైల్ ధర రూ.10,999 రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది.



ఈ స్మార్ట్ మొబైల్ 4GB RAM+64 GB స్టోరేజ్  వేరియాంట్ తో కలదు. అలాగే ..6GB RAM+128 GB స్టోరేజ్ గల వేరేటి మొబైల్లో తీసుకురాబోతోంది. బ్యాటరీ విషయానికి వస్తే రియల్ మీ S -23 స్మార్ట్ మొబైల్ లో 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 5000 MAH సామర్థ్యం కల బ్యాటరీ కలదు. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.7 అంగుళాల డిస్ప్లే కలదు. ఆండ్రాయిడ్ v -13 ఆపరేటింగ్ ద్వారా ఈ మొబైల్ పనిచేస్తుంది ముఖ్యంగా ఈ మొబైల్ కు కెమెరాకు అత్యధిక ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


50 ఎంపీ మెగాఫిక్ సెల్ రేర్ కెమెరాతోపాటు 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలదు.. స్మార్ట్ మొబైల్ 7.49 M.M సామర్థ్యంతో రూపొందించారు 34 నిమిషాలలో 50% చార్జింగ్ పూర్తి కావడం ఈ మొబైల్ ప్రత్యేకత అన్నట్లుగా తెలుస్తోంది. అలాగే అదనంగా 2 జిబి ర్యామ్ వరకు ఈ మొబైల్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఎవరైనా తక్కువ ధరకే ఫీచర్ మొబైల్ ని కొనాలనుకునేవారు ఈ మొబైల్ ని తీసుకోవచ్చు అధికారిక వెబ్సైట్ తో పాటు అమెజాన్ లో ఈ స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: