ఈ మధ్యకాలంలో పెట్రోల్ బైకులు హవా కాస్త తగ్గింది ముఖ్యంగా మైలేజ్ గురించి కూడా చాలా మంది ఆందోళన చెందుతూ ఉండడంతో పాటు పెట్రోల్ ధరలు కూడా అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపైన భారీగానే డిమాండ్ పెరుగుతోంది.. ఎలక్ట్రిక్ బైక్ కొనడం కాస్త ఖర్చు ఎక్కువ అయినప్పటికీ కొంతమంది మాత్రం కొంటూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా పూణేకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలలో ఒకటైన టోర్కో మోటర్ ఒక భారీ ఆఫర్ను విడుదల చేసింది..


Kratos Rఎలక్ట్రిక్ బైక్ పై రూ .37 వేల రూపాయలను తగ్గించింది. మార్చి 31 వరకు..kratos R బైకు పైన ఈ తగ్గింపు కలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ అద్భుతమైన రేంజ్ ఫీచర్లతో పాటు సరికొత్త టెక్నాలజీతో ఉంటుంది... టోర్కో మోటర్ ఇటీవలే ఈ బైక్ పైన రూ.15 వేల రూపాయలను తగ్గించింది.. ఇది కాకుండా గత ఏడాది కూడా రూ .22 వేల రూపాయలను మరింత తగ్గించింది టోర్కో మోటార్ సంస్థ.. ఈ ఎలక్ట్రిక్ బైక్ పైన మొత్తం మీద వీటన్నిటిని కలుపుకుంటే రూ.37 వేల రూపాయల తగ్గింపుతో మనం కొనుగోలు చేసుకోవచ్చు..

KRATOS R బైక్ కొత్త ఎక్సేంజింగ్ షోరూమ్ ధర విషయానికి వస్తే.. రూ.1.50 లక్షలు కలదు.. ఇందులో సబ్సిడీ కూడా ఉన్నది. గతంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ రూ.1.87 లక్షల వరకు ఉండగా.. మార్చి 31న ముగుస్తుంది కంపెనీ మాత్రం కస్టమర్ల కోసం ప్రజల కోసం మరొక నెల రోజులపాటు ఈ తగ్గింపుని కల్పిస్తోంది. KRATOS R బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందట..9KW బ్యాటరీ ప్యాక్ నుంచి ఉంటుంది.. ఈ బైక్ సిటీ స్పోర్ట్స్ రివర్స్ మోడ్ లను కూడా అందిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: