మంగళూరు కొరగజ్జ ఆలయం లో ప్రవేశించడమే కాక అక్కడ మూత్రం పోసి హుండీ లో కండోం వేసి బీభత్సం సృష్టించారు ముగ్గురు ముస్లిం యువకులు. అయితే అందులో ఒకరు రక్తం కక్కుకుని, తల గోడకు కొట్టుకుని అనూహ్య రీతి లో చనిపోవడం తో మిగతా ఇద్దరు యువకులు దేవుని శాపం తగులుతుందేమో అని తమ నేరాన్ని అంగీకరించి శిక్షను ఎదుర్కొనేందుకు ఆ గుడికి వెళ్లి లొంగి పోయారు. ఆంగ్ల పత్రిక ఇండియా టుడే నివేదిక ప్రకారం, నిందితులు అబ్దుల్ రహీమ్ మరియు తౌఫిక్ జోకట్టే నివాసితులు.
ఇద్దరు గుడిలో కండోమ్స్ వేయగా, మరొకరు మాత్రం ఆలయ ప్రాంగణంలో మూత్రం పోసి అపచారాన్ని ముట కట్టుకున్నారు. ముందు పిచ్చిగా ప్రవర్తించిన నవాజ్ ఆ తరువాత రక్తం కక్కుకోవడం, రక్తపు విరేచనాలు లాంటి లక్షణాల తో బాధ పడ్డారు. తట్టుకోలేక తల గోడ కు కొట్టుకుని మరణించారు. అతను మరణించాక తర్వాత తౌఫిక్ కూడా నవాజ్ కు వచ్చిన లక్షణాలే తనకూ వస్తున్నాయని గుర్తించారు. దీంతో ఆ దేవుడికి చేసిన అపరాధం ఒప్పుకోవాలని నిర్ణయించుకుని అలానే చేశారు. మంగళూరు పోలీసు కమిషనర్ ఎన్ శశి కుమార్ మాట్లాడుతూ నవాజ్ అనారోగ్యాని కి గురైనప్పుడు, వారి నేరాన్ని అంగీకరించమని స్నేహితుల కు సలహా ఇచ్చాడు. సీసీ టీవీ పుటేజ్ ల ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు..