కూల్ డ్రింక్ తాగడం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే ఉంటుంది.. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎక్కువగా తాగుతున్నారు ఈ కూల్ డ్రింక్ లను. ఇక అలాగే కొన్ని అనారోగ్య సమస్యలను కూడా తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పటికే పలు పరిశోధనలలో తేలిన విషయం ఏమిటంటే అందులో పురుగుల మందులు కూడా ఉన్నట్లు తేల్చి చెప్పారు. అయితే వాటి మోతాదు తక్కువగా ఉండడం వల్ల, కూల్ డ్రింక్ తాగిన వ్యక్తికి అది స్లో పాయిజన్ గా ఎక్కుతుందట.

ఇక ఇదే తంతు లో నిదానంగా శరీరంలోపల ఉండే అవయవాలను దెబ్బతినేలా చేస్తుందట. ఇక ఇప్పుడు ఒక వ్యక్తి కూల్ డ్రింక్ తాగిన ఆరు గంటల లోనే మరణించాడట. ఆయన ఎందుకు మరణించాడో  ఇప్పుడు కారణాలను తెలుసుకుందాం. కూల్ డ్రింక్ తాగడానికి ఎంత ఇష్టం ఉన్నా సరే వాటిని తాగడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇక అదే పనిగా తాగితే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనేదానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

చైనాకు చెందిన ఒక వ్యక్తి..1.5 లీటర్ల కోకో కోలాను కేవలం పది నిమిషాల్లోనే తాగేసాడట. తాను బాటిల్ దింపకుండా తాగి  తమ ఫ్రెండ్స్ ముందర  హీరో అవ్వాలనుకున్నాడు. కానీ అలా తాగిన కొద్ది గంటల తర్వాత అతని శరీరం అదుపు తప్పింది. అతను కడుపు ఒక్కసారిగా ఉబ్బిపోయిందట, తీవ్రమైన కడుపు నొప్పితో అతడి దగ్గర్లోనే ఉండే హాస్పిటల్ కు చేరగా.. వైద్యులు సిటి స్కాన్ చేసి కడుపులో గ్యాస్ ఉన్నట్లు గుర్తించారు.

బాడీలో కొన్ని శరీరాలలో  గ్యాస్ నిండిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఆ వైద్యులు తెలియజేశారు. ఇలా ఏర్పడినప్పుడు కాలేయానికి ఆక్సిజన్ అందక అది నిలిచిపోతుందని తెలియజేశారు. చివరిగా వైద్యులు అతడిని రక్షించ లేకపోయారు. ఆ వ్యక్తి శరీరం నుంచి గ్యాస్ బయటకు తీసేయడానికి ఎంత ప్రయత్నించినా కానీ ఫలితం దక్కకుండా పోయింది. వైద్యులు అతనికి కాపాడేందుకు సుమారుగా 18 గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. దీంతో ఒక్కసారిగా తమ ఫ్రెండ్స్ అందరూ షాక్ కు గురయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: