ఇటీవలి కాలంలో మనుషుల్లో మానవత్వం పూర్తిగా కనుమరుగై పోతుంది అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు తెరమీదకు వస్తున్నాయి. టెక్నాలజీ పరంగా మనిషి ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తూ ఉన్నప్పటికీ మానవత్వం పరంగా మాత్రం రోజుకు మనిషి అట్టడుగు స్థాయికి పడిపోతున్నాడు అన్నది నేటి రోజుల్లో ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. భూభాగాన్ని మొత్తం వశపరచుకోవాలని అత్యాశతో చేయరాని  పనులన్నీ చేస్తూ ఉన్నాడు మనిషి.  ఈ భూమి మీద ఉండే జీవరాసులు అన్నింటి ప్రాణాలను కూడా తీయడానికి కూడా వెనకాడడం లేదు అనే చెప్పాలి.


 ముఖ్యంగా ఈ భూమండలంలో మనిషి మనుగడకు ఇండైరెక్ట్గా కారణమైన పక్షులు జంతువులను సైతం ఈ భూమ్మీద బ్రతకనివ్వకుండా  దారుణంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మనుషులకు తప్ప ఈ భూమ్మీద బ్రతికేందుకు ఇంకే జీవికి  కూడా అర్హత లేదు అనే విధంగానే మనుషుల ప్రవర్తన నేటి రోజుల్లో కనిపిస్తుంది అని చెప్పాలి. కొంతమంది  వ్యక్తులు మూగజీవాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహానికి  గురిచేస్తుంది అనే చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.   పక్షులను నిర్ధాక్షణ్యంగా చంపేసిన  వీడియో కాస్త ట్విట్టర్లో  వైరల్ గా మారింది.


 ప్రశాంతంగా చెట్టుపై సేదతీరుతున్న అనేక పక్షులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇక వందల పక్షులు ఉన్న చెట్లు నేలమట్టం చేయడంతో ఇక ఆ చెట్టు కింద పడి ఎన్నో  పక్షులు ప్రాణాలు  కోల్పోయాయి. ఇలా అప్పటి వరకూ ఎంతో స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ కనిపించిన పక్షులు రెప్పపాటుకాలంలో చెట్టు కింద పడి చివరికి ప్రాణాలు  కోల్పోయాయి. ఇక ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ అధికారి ప్రవీణ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. మనిషి తన సొంత అవసరాలు తీర్చుకోవడం కోసం రోజురోజుకు క్రూరంగా మారిపోతున్నాడు అని ఈ వీడియో చూసిన తర్వాత ఎంతోమంది కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: