చాలా మంది కూడా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు.అయితే వీటిలో కొన్ని లక్షల్లో ఉంటే.. మరి కొన్ని మాత్రం కోట్లలో ఉంటాయి. అయితే ఇలాంటి పరిణామాలు గల్ఫ్ దేశాలతో పాటూ అమెరికాలో కూడా జరుగుతూ ఉంటాయి.అయితే  కేరళకు చెందిన 39 ఏళ్ల శ్రీజు బుధవారం నాడు జరిగిన మహ్జూజ్ సాటర్డే మిలియన్స్ డ్రాలో ఏకంగా రూ. 45కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఆయన జీవితం స్థిరపడిపోయినట్లు సంబరపడి ఆశ్చర్యానికి లోనైయ్యారు. గత 11 సంవత్సరాలుగా అరబ్ దేశాల్లో పనిచేస్తున్న అతను కేరళలో ఒక చిన్నపాటి ఇళ్లుని కూడా నిర్మించుకోలేదు. ఇక ఈ విజయం సాధించిన తరువాత అతని మాటలు వింటే చాలా సామాన్యమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అనిపిస్తుంది.ఇక ఆయన ఏమన్నాడంటే.. ‘నేను నా కార్లో తిరుగుతున్నాను. లాటరీ సంస్థకు చెందిన మహ్జూద్ ఖాతాను చెక్ చేసుకున్నప్పుడు నా కళ్లను నేనే నమ్మలేకపోయానన్నారు. ఈ గెలుపు నిజం అని మహ్జూజ్ నుంచి కన్ఫర్మేషన్ కాల్ రావడంతో ఈ అద్భుతమైన విజయాన్ని చూసి చాలా అయోమయంలో పడ్డానని పేర్కొన్నారు’. ఇలాంటి అరుదైన అదృష్టాన్ని గతంలో చాలా మంది భారతీయులు యూఏఈ లక్కీ డ్రాలో దక్కించుకొని పెద్ద పెద్ద విజయాలు సాధించారు.


తాజాగా ముంబైకి చెందిన మనోజ్ భావ్‌సర్ అనే వ్యక్తి కూడా ఈ లక్కీ డ్రాలో ఘన విజయం సాధించారు. ఇతను అబుదాబిలో 16 సంవత్సరాలుగా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇతను FAST5 రాఫిల్ అనే లాటరీలో సుమారు రూ. 16లక్షల డబ్బుని గెలుచుకున్నారు. అయితే అక్కడి కరెన్సీ ప్రకారం 75వేల దిర్హాంగా చెప్పుకొచ్చారు. ఇక ఈ లాటరీలో గెలిచిన డబ్బుల ద్వారా తన అప్పులను తీర్చుకోగలిగానన్నారు.ఇలా తమ అదృష్టాన్ని పరీక్షించుకొని లాటరీలను కొనే వారిలో మన భారతీయులే చాలా ఎక్కువ ఉంటారు. గత కొన్ని వారాల క్రితం దుబాయ్‌లో జరిగి డ్యూటీ-ఫ్రీ మిలినియం మిలినియర్ డ్రాలో భారత దేశానికి చెందిన మహిళ యూఎస్‌డి 1 మిలియన్ డబ్బుని సాధించారు. ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా అధిక ధరలు వెచ్చించాల్సి ఉంటుంది. తమ సంపాదనలో కొంత డబ్బులు పోగుజేసుకొని అప్పుడప్పుడూ ఇలా కొంటూ ఉంటారు.అయితే ఇలా కొనడం ద్వారా అదృష్టం వరించి కొందరు కొన్ని కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: