
కానీ ఇక్కడ మాత్రం ఇండియా ప్రైం మినిస్టర్ కు అంతకంటే ఎక్కువ అభిమానం దొరికిందన్నారు. సీడ్నీలోని కుడోస్ బ్యాంకు అరీనాలో జరిగిన సమావేశానికి వేల మంది భారతీయులు హాజరై మోదీ నినాదాలతో హోరెత్తించారు. భారత ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆరోసారి నేను భారత ప్రధానిని కలవడం అని అల్బనీస్ అన్నారు.
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఇలాంటి బంధమే కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భారత్ ఆస్ట్రేలియాకు కీలక భాగస్వామి అని చెప్పడానికి ఇష్టపడతానని అన్నారు. హిందూ మహా సముద్రంలో జరిగే వర్తక, వ్యాపార విషయాల్లో చాలా స్నేహపూర్వకంగా కొనసాగుతున్నట్లు ప్రకటించారు.
భారత్ వేగంగా అభివృద్ది సాధిస్తోందని ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇండియా నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్న వారు ఆస్ట్రేలియా అభివృద్ధికి తోడ్పడుతున్నారని మెచ్చుకున్నారు. ఇండియాతో మాకు క్రీడా పోటీల విషయంలో శత్రుత్వం ఉన్నా అది మంచికేనని అన్నారు. అయితే ఇండియాకు వచ్చిన ఏ దేశపు ప్రధానిని గానీ ఇతర ముఖ్య అధికారిని గానీ ఇలా పొగిడితే ఇప్పటికీ రచ్చ రచ్చ అయ్యేది. బానిసలా బతుకుతున్నాం అంటూ, దేశ పరువును విదేశీయుల ముందుకు తాకట్టు పెట్టారని ప్రతిపక్షాలు దుమ్ముత్తి పోసేవి.