సాధారణంగా పెళ్లి తర్వాత తల్లి అవ్వడం అనేది ప్రతి ఒక్క మహిళ జీవితంలోనూ గొప్ప వరం లాంటిది. గర్భం పొందడం, బిడ్డకు జన్మనివ్వడం, అమ్మ అనిపించుకోవడంలో ఉన్న మాదుర్యం కేవలం ఆ మహిళకు మాత్రమే తెలుస్తోంది. అందుకే ఎంత కష్టమైనా.. తమ కడుపులో మరో ప్రాణాన్ని మోసేందుకు ఆరాటపడుతుంటారు. ఇక గర్భం పొందిన దగ్గర నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందులో ముఖ్యంగా ఆహార జాగ్రత్తలు. అయితే ఇందులో భాగంగా ఎన్నో అనుమాలు.. మరెన్ని భయాలు. ఏది తినాలి.. ఏది తినకూడదు అన్నది అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతుంటారు.
అలా కొందరు ప్రెగ్నెన్సీ టైమ్లో తేనెను తీసుకోవచ్చా..? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తారు. అయితే వాస్తవానికి ప్రెగ్నెన్సీ స్త్రీలు తేనెను తీసుకోవడంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ప్రెగ్నెన్సీ టైమ్లో గుండెల్లో మంట మరియు అజీర్ణం సమస్య ఏర్పడుతుంటుంది. అటువంటి సందర్భంలో రోజూ ఒక గ్లాసు వెచ్చని పాలతో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా తేనె సేవించడం ద్వారా అలెర్జీలకు దూరంగా ఉంటారు. ఇది గర్భధారణలో వచ్చే స్కిన్ అలర్జీలకు దూరంగా ఉంచుతుంది.
అదేవిధంగా, ఒక టేబుల్ స్పూన్ తేనెను డైట్లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి సమృద్ధిగా పెరుగుతుంది. కాబట్టి ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ తేనెను గోరువెచ్చని నీటితో కలిపి సేవించండి. తద్వారా గర్భం ప్రారంభంలో సంభవించే అత్యంత సాధారణ అలసట మరియు అనారోగ్య సమస్యలు నుంచి రక్షించుకోవచ్చు. ఇక తేనె గర్భిణీ స్త్రీలకే కాకుండా సామాన్యులకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. పరగడుపున తేనె పానీయాన్ని తీసుకోవడం వల్ల మీలో శక్తిని పెంచి, బద్ధకాన్ని, అలర్జీలను తొలగిస్తుంది. మరియు రోజంతా యాక్టీవ్గా ఉండేలా చేస్తుంది.