ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బీఎండబ్ల్యూ 340ఐ మోడల్ విడుదలైంది. 3సిరీస్లోని మోడలైన ఈ కారు ఎక్స్షోరూమ్ ధర రూ.62.90 లక్షలుగా నిర్ణయించారు. పరిమిత సంఖ్యలోనే ఈ కార్లను విక్రయించాలని బీఎండబ్ల్యూ నిర్ణయించింది. ఈ సరికొత్త మోడల్ 340ఐను దేశీయంగానే తయారు చేస్తోంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ను స్వీకరిస్తోంది. దీనికి లక్షరూపాయలు చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. తొలి 40 మంది కస్టమర్లకు రేస్ట్రాక్ డ్రైవర్ ట్రైనింగ్ శిక్షణ కూడా ఇవ్వనుంది. ఈ కారులో 3.0లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజిన్ను అమర్చారు. ఇది 387 బీహెచ్పీ శక్తి, 500 ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది.