న్యాయవాదుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని.. ఇంకా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నర్సింహారెడ్డి నేతృత్వంలో కౌన్సిల్ సభ్యులు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి ఏటా 10 కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని బార్ కౌన్సిల్ ప్రతినిధులు కోరారు. న్యాయవాది మరణిస్తే నామినీకి సంక్షేమ నిధి నుంచి 4 లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని.. ప్రభుత్వం తరపున మరో 4 లక్షల రూపాయలు చెల్లించాలని కోరారు.
న్యాయవాదుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని.. ఇంకా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నర్సింహారెడ్డి నేతృత్వంలో కౌన్సిల్ సభ్యులు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి ఏటా 10 కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని బార్ కౌన్సిల్ ప్రతినిధులు కోరారు. న్యాయవాది మరణిస్తే నామినీకి సంక్షేమ నిధి నుంచి 4 లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని.. ప్రభుత్వం తరపున మరో 4 లక్షల రూపాయలు చెల్లించాలని కోరారు.