ఇవాళ ఏపీ సీఎం జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ఉంటుంది. విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు కుటుంబాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. మధ్యాహ్నం 12 గంటలకు యలమంచిలిలో విశాఖ పశ్చిమ వైకాపా సమన్వయకర్త అడారి ఆనంద్‌ నివాసానికి చేరుకుంటారు.

ఆ తర్వాత అడారి ఆనంద్  తండ్రి, విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు భౌతిక కాయానికి సీఎం వైఎస్‌ జగన్‌  నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అడారి ఆనంద్‌ కుటుంబ సభ్యులను సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత 12.40 గంటలకు  బయలుదేరి 2.25 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: