ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేసారు. వరదలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజలను అదుకోవాల్సింది పోయి ఎం కావాలి రా మీకు? మమ్మల్నే ప్రశ్నిస్తారా? పోండి అవతలకి అంటూ ఛీత్కరించుకొని వెళ్లిపోయారు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు అని ఆయన ట్విట్టర్ లో ఆరోపణలు చేసారు. గుంటూరు జిల్లా, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం లంక గ్రామాల్లో పర్యటించిన వైకాపా ప్రజాప్రతినిధుల బృందానికి ప్రజల సమస్యలు వినే ఓపిక కూడా లేకపోవడం దారుణం అన్నారు.

ఆదుకోమని అడిగిన పాపానికి అధికార బలుపుతో ప్రజల పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని మండిపడ్డారు. రైతులు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ వరద నీళ్లలో ఉన్నారని... ప్రజలని వరదల్లో వదిలేసి ఇంట్లో ఫిడేలు వాయించుకుంటున్న ఆంధ్రా నీరో జగన్ రెడ్డి గారు ఇప్పుడైనా మేల్కోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: