భారత్-అమెరికాల మధ్య అత్యంత కీలకమైన 2+2 చర్చలు ప్రారంభమయ్యాయి.
ఢిల్లీ వేదికగా రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల కోసం
అమెరికా విదేశాంగ
మంత్రి మైక్ పాంపియో, రక్షణ
మంత్రి మార్క్ ఎస్పర్లు భారత్కు విచ్చేశారు. సోమవారం వారికి గౌరవ వందనంతో భారత అధికారులు స్వాగతం పలికారు.భారత రక్షణశాఖ
మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఇవాళ
అమెరికా రక్షణ
మంత్రి మార్క్ ఎస్పర్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్,
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుండ్ నరవణె, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబిర్ సింగ్ పాల్గొన్నారు.
రక్షణ సమాచార మార్పిడి, సైనిక సంప్రదింపులు, రక్షణోత్పత్తుల వ్యాపారంపై ప్రధానంగా చర్చించనున్నారు. అత్యంత కీలకమైన బేసిక్ ఎక్స్చేంజీ అండ్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా)పై సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధిలోనే భారత్-అమెరికా మధ్య మూడోసారి 2+2 చర్చలు జరుగుతున్నాయి.అమెరికా విదేశాంగ
మంత్రి మైక్ పాంపియో, విదేశీవ్యవహారాల శాఖ
మంత్రి జైశంకర్ తర్వాత భేటీ కానున్నారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలతో పాటు, ప్రాంతీయ,
అంతర్జాతీయ విషయాలపై నేతలు చర్చించనున్నారు.