తెలంగాణలో కురుస్తున్న వరుస వర్షాలకు నదులు, వాగులు పోటెత్తుతున్నాయి. ప్రత్యేకించి మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. అందుకే  పరివాహిక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మూసీ పరివాహిక ప్రాంతంలో ప్రజలకు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హిమాయత్ సాగర్ జలాశయoలోకి అధికంగా వరద నీరు వస్తోంది.


ఈ ఉదయం 6 గంటల వరకు హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా... ప్రస్తుతం 1762.60  అడుగులకు నీరు చేరింది. హిమాయత్ సాగర్ లోకి 1666 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇలాగే వరద కొనసాగితే గేట్లు ఎత్తాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు సిద్ధం అవుతున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తితే మూసిలోకి భారీగా నీరు వస్తుంది. అందుకే మూసీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగితే మూసీ పరివాహక ప్రాంతంలో ముంపు తప్పదని హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: