గ్యాస్ సిలిండర్ పేలుడు  9 మంది ప్రాణాలు తీసింది.. కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ శివారులో ఈ పెను విషాద ఘటన జరిగింది. చిన్న గదిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో మృతుల సంఖ్య  తొమ్మిదికి చేరింది. ఇందులో మరింత విషాదం ఏంటంటే.. చనిపోయిన వారిలో నలుగురు పసి పిల్లలు కూడా ఉన్నారు. ఓ గదిలో ఎల్‌పీజీ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. దీంతో భారీ  పేలుడు సంభవించింది.


ఈ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మహిళలు, చిన్నారులు మొత్తం 10 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ గురువారం ముగ్గురు మృతి ఇదే ఘటనలో శుక్రవారం ఐదుగురు, శనివారం ఒకరు చనిపోయారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు  మధ్యప్రదేశ్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనలో మరొక వ్యక్తి చికిత్స పొందుతున్నాడు.. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: