ఈ ఏడాది ఐపిఎల్ ను కరోనా వదిలే అవకాశాలు అసలు కనపడటం లేదు. కరోనా కేసులు ఐపిఎల్ లో మళ్ళీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనాకు సంబంధించి బోర్డ్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఐపీఎల్ లో కరోనా కలకలం మరోసారి ఆటగాళ్లను కంగారు పెడుతుంది. ఐపీఎల్ లో సన్రైజర్స్ టీమ్ లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఫాస్ట్ బౌలర్ నటరాజన్ కు ఆర్ టి పి సి ఆర్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

ఐసోలేషన్ లోకి నటరాజన్  వెళ్ళాడని తెలుస్తుంది. నటరాజన్ తో సన్నిహితంగా ఉన్న ఆరుగురు సన్రైజర్స్ టీం సభ్యులు సైతం ఐసోలేశన్ లో ఉన్నారని సమాచారం. ఈరోజు రాత్రి దుబాయ్ వేదికగా సన్రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. నటరాజన్ తో సన్నిహితంగా ఉన్న మిగతా సభ్యులకు  నెగిటివ్ రావడంతో మ్యాచ్ యధాతథంగా నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl