కొంప ముంచిన కుటుంబ కలహాలు
కవి తిక్కన ఖడ్గ తిక్కన పుట్టి పెరిగిన నెల్లుూరు జిల్లా ప్రశాంతతకు పెట్టింది పేరు. అలాంటి జిల్లాలో వరుస వెంబడి జరుగుతున్న ఘటనలు కలకలం సృష్టి స్తున్నాయి. తాజాగా దొరవారిసత్రం మండలం మోదుగులపాలెం లో కుటుంబ కలహాల నేపథ్యంలో కుటుంబం మొత్తం విషం సేవించింది. ఈ ఘటనలో మేర్లపాక మురళి (40) అతని తల్లి మస్తానమ్మ(60) చనిపోయారు. కుమార్తె కావ్య శ్రీ(11) ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో ఉంది.

మేర్లపాక మురళి ఇంట్లో ఏదో శబ్దాలు రావడంతో ,   గమనించిన స్థానికులు ఇంటిదగ్గర కి వెళ్ళి  చూడగా   మస్తానమ్మ(60) చనిపోయి ఉంది ,మురళి(40) కావ్య శ్రీ(11) కొన ఊపిరితో ఉండడంతో వీరిని హుటాహుటిన సూళ్లూరుపేట ఆసుపత్రికి తరలించారు . అక్కడ ఆసుపత్రిలో మురళి ప్రాణాలుూ విడిచారు మెరుగైన వైద్యం కోసం కావ్య శ్రీ ని నెల్లూరు ఆస్పత్రికి తరలింనట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరా లు అందాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: