ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఓ అవ‌మానీయ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. కసింకోట‌లో ఇటీవ‌ల ఓ ప‌సికందు అనుమాన‌స్పదంగా మృతి చెందిన విష‌యం విధిత‌మే. అయితే ఎట్ట‌కేల‌కు ఆ ప‌సికందు అనుమాన‌స్ప‌ద మృతి కేసులో చిక్కుముడి వీడిన‌ది. ప‌సికందును త‌ల్లి సంధ్య‌నే  చంపింద‌ని, హంతకురాలుగా త‌ల్లినే అని నిర్థారించారు పోలీసులు.

త‌న మ‌తిస్థిమితం బాగాలేద‌ని, ఎందుకు చంపానో త‌న‌కు తెలియ‌దు అని ఆమె పోలీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చింది సంధ్య. సంధ్య గ‌త కొంత కాలం క్రితం అప్ప‌ల‌రాజును ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్పార్థాలు రావ‌డంతో నిన్న అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు 37 రోజుల బాబును తీసుకెళ్లి సంధ్య వ‌రండాలో ఉన్న డ్ర‌మ్ములో ముంచింది. ఆ త‌రువాత త‌న‌కు ఏమి తెలియ‌న‌ట్టుగా బాబు క‌నిపించ‌డం లేద‌ని కాసేపు డ్రామా ఆడింది. పోలీసులు త‌మ‌దైన స్టైల్‌లో విచారించ‌గా  అస‌లు నిజం వెలుగులోకి వ‌చ్చింది.  దీంతో పోలీసులు సంధ్య‌ను అదుపులోకి తీసుకున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: