వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడించేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంను కైవసం చేసుకుని టీడీపీకి షాక్ ఇచ్చింది. కుప్పం చంద్రబాబు కంచుకోట లాంటింది. అలాంటి చోట కూడా వైసీపీ సత్తా చాటుతోంది. అప్పటి నుంచి చంద్రబాబు కుప్పంలో గెలిస్తే గొప్పే అంటూ వైసీపీ మాటల దాడి చేస్తోంది.


ఈ నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబుపై వైసీపీ నుంచి హీరో విశాల్ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. హీరో విశాల్ రెడ్డి కులానికి చెందిన వ్యక్తి.. ఆయన్ను పోటీ  చేయించవచ్చని వస్తున్న వార్తలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. కుప్పంలో విశాల్‌ పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు. కుప్పంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ భరత్ రెడ్డే పోటీ చేస్తారని పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఎల్లో మీడియా ప్రచారమేనని మంత్రి పెద్దిరెడ్డి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: