మంకీ పాక్స్.. కరోనా తర్వాత ప్రపంచాన్ని ఎక్కువగా భయపెడుతున్న వ్యాధి ఇది. దీని ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటోంది. తాజాగా మంకీపాక్స్ విజృంభిస్తున్న సమయంలో టీకాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాధిని టీకాల ద్వారా సమర్థంగానే కట్టడి చేశాం. కానీ అదే ఫలితం మంకీ పాక్స్ విషయంలో మాత్రం కుదరదని  ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

ఎందుకంటే.. మంకీ పాక్స్ టీకాలు 100 శాతం ప్రభావం చూపుతాయని ఆశించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందుకే తగిన జాగ్రత్తలు పాటించే విషయంలో అలసత్వం పాటించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే 92 దేశాలకు మంకీ పాక్స్ వైరస్ విస్తరించింది. ఇప్పటి వరకూ దాదాపు 35 వేల మంది వైరస్ బారిన పడ్డారు.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 12 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: