వైయస్సార్సీపి పట్ల అందులో పని చేసే రాజకీయ నాయకుల దగ్గర స్వరం మారుతున్నట్టు కనిపిస్తుంది. మొన్నటి వరకూ బయటి నుంచి వచ్చిన  రఘురామకృష్ణంరాజు, ఆనం రామ నారాయణ రెడ్డి మొదలైన వారు జగన్‌ను నిలదీస్తే అది పెద్ద విషయంగా మారింది. అయినా ఆయన వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు సొంత పార్టీలోనే ఆయన నిలదీయడానికి వ్యతిరేక శక్తులు తయారవుతున్నట్టు తెలుస్తుంది. మొన్నటిదాకా జగన్ నే నమ్ముకున్నటు వంటి సుచరిత బయటికి వెళ్ళేటటువంటి సందర్భం ఒక ఎత్తు అయితే, నాడు జగన్ కోసం రాజీనామా చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి నమ్మకమైనవాళ్ళు కూడా అసంతృప్తితో ఉండటం మరొక ఎత్తు.


ఇవన్నీ కూడా క్రమంగా వైఎస్ఆర్సిపి పార్టీకి తగలబోయేటటువంటి ఎదురు దెబ్బలేనని ఆయనకు అర్థం అవుతుందో లేదో తెలియదు.  ఇది మాత్రమే కాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహాలో  ఎమ్మెల్యేలకు ఉద్వాసన పలకడం ‌ అనేది మరొక అంశం. యోగి ఆదిత్యనాథ్ తరహాలో లేదా గుజరాత్ లో అమిత్ షా తరహాలో సక్సెస్ అయినట్లు అన్ని సందర్భాల్లోనూ సక్సెస్ అవుతుందని చెప్పలేం.  


ఒకవైపు సంక్షేమం పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి  విషయంలో కొంతమంది  విషయం పక్కన పెడితే   100 కి 90 మంది జగన్ అంటే అభిమానంగా ఉన్నారు. కానీ మరో వైపు టీచర్లు నుంచి, ఉద్యోగులు విషయంలో,  పోలీసుల దగ్గర నుంచి సినిమా రంగం వారి నుంచి,  చివరికి తటస్థుల దాకా అందరూ జగన్ మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆ వ్యతిరేకత ఇప్పుడు జగన్ కి శరాఘాతంగా తగలబోతుందా అంటే ఖచ్చితంగా కాదనలేని పరిస్థితి.
 

ఇప్పటి నుంచి అయినా జగన్ తేరుకుని తన తప్పులు తెలుసుకోకపోతే మాత్రం ఫలితాలు మారిపోయే పరిస్థితి. చంద్రబాబు పట్ల అసహ్యం వేసి జగన్‌కు ఓట్లు వేసిన  పరిస్థితి  మొన్న ఎలక్షన్స్ లలో చంద్రబాబుని దెబ్బ కొట్టింది. ఇప్పుడు అదే పరిస్థితి జగన్ కూడా రాబోతుందేమో.. ఆయన ఇప్పటికైనా జాగ్రత్త వహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: