
ఈ ఎత్తుగడతో అక్కడ ఎటువంటి రాజకీయాలకు ఆస్కారం లేకుండా పోయింది. అలాగే ఈ నిర్ణయం జమ్మూ అండ్ కశ్మీర్ ప్రాంత అభివృద్ధికి దోహదం అవుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు బెంగాల్ లోని కొంత భాగాన్ని విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సంచలన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.దేశ సార్వభౌమాధికారం, దేశ రక్షణ కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యంగా పశ్చిమబెంగాల్ లోని చైనా సరిహద్దు గల కూచ్ బెహార్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనుంది. ఈ ప్రాంతం టోర్స నదికి తూర్పు భాగాన ఉంది. దీనిని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం సిలువురి కారిడార్ లేదా చికెన్ నెక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఈ కూచ్ బెహార్ ప్రాంతం భారతదేశంలోని మిగతా రాష్ట్రాలను అలాగే ఈశాన్య రాష్ట్రాలను కలిపే ప్రాంతం. ఇది దేశంలోనే అత్యంత ఇరుకైన కారిడార్. ఇది కేవలం 17 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది.
ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తే భారతదేశ నుంచి 8 ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయవచ్చని చైనా భావిస్తోంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, దేశాలకు ఇది సరిహద్దుగా ఉంటుంది. పశ్చిమబెంగాల్, అస్సాం, భూటాన్, బంగ్లాదేశ్ లకు వాణిజ్యం, పర్యాటకం కోసం ఈ కూచ్ బెహార్ ప్రాంతం ముఖ్యమైనది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశాన్ని విడగొట్టాలని చూసే గ్యాంగులు ముఖ్యంగా ఈ ప్రాంతం పైనే దృష్టి కేంద్రీకరించాయి. అటు చూస్తే బెంగాల్ ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించకోవడం లేదు. అందువల్ల దేశాన్ని విడగొట్టే ముఠాలను గ్యాంగులను అంతం చేయడానికి మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగానే కూచ్ బెహార్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది.