రష్యా పని అయిపోయిందని ఉక్రెయిన్, అమెరికా ప్రచారం చేస్తున్న సమయంలో రష్యా సరికొత్త ఆయుధాలను బయటపెడుతూనే ఉంది. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడింది. ప్రస్తుతం సుఖోయ్ 35 యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ లో బీభత్సం సృష్టిస్తోంది. అవన్నీ పక్కన పెడితే హైపర్ సోనిక్ పవర్ పుల్ మిస్సైల్ ను రష్యా బయటకు తీసింది. ఇది శబ్దం కంటే ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. దీన్ని ఏడు గంటల పాటు ఖర్గీవ్, ప్రాంతంలో రష్యా ప్రయోగించినట్లు తెలుస్తోంది.  


ఈ యుద్ధం మొదలైన తర్వాత మొదటి సారి ఈ హైపర్ సోనిక్ యుద్ధ విమానాల్ని ప్రయోగించింది. ఇది ఎంత భీకరమైనవి అంటే దాదాపు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నలక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదిస్తుంది. 10 శాతం ఎక్కువ సామర్థ్యం ఉన్న మిస్సైల్స్ అని చెబుతున్నారు. వీటిని మిగ్ 31 యుద్ధ విమానాల ద్వారా దీన్ని ప్రయోగించింది.  వీటి రేడియేషన్ తగ్గించి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్ని ఛేదించింది. ముఖ్యంగా వీటికి ఉండే న్యూక్లియర్ వార్ హెడ్ లను తగ్గించింది.


లేకపోతే న్యూక్లియర్ బాంబ్ ఎటాక్ జరిగిదే. దీన్ని ఉక్రెయిన్ కు హెచ్చరికగా మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అమెరికా అండతో ఏ మాత్రం రెచ్చిపోయినా, రష్యాను రెచ్చగొట్టినా చివరకు నష్టపోయేది ఉక్రెయిన్ మాత్రమే కాదు దాని చుట్టు పక్కలా ఉన్న యూరప్ దేశాలు కూడా. ఇది అతి క్రూరమైన ఎటాక్ అని చెప్పొచ్చు. బాగ్ ముత్ సిటీ,కెమటస్క్, స్లోవియక్స్ ప్రాంతాలు కూడా ఉక్రెయిన్ నుంచి రష్యాకు స్వాధీనం కాబోతున్నట్లు తెలుస్తోంది.



కాబట్టి ఇప్పటికైనా ఉక్రెయిన్ తగ్గి లొంగిపోతే మిగిలిన ప్రాంతాలనైనా దాడులు కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది . కానీ అమెరికాను నమ్ముకుని ముందుకు పోతే మాత్రం చివరకు నష్టపోయేది మాత్రం ఉక్రెయిన్ అని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: