ఈ ప్రభావం పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.మహబూబాబాద్ ములుగు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల్లో బీసీలకు రిజర్వేషన్లు 2019తో పోలిస్తే గణనీయంగా తగ్గాయని కవిత డేటాతో సహా వివరించారు. ఏజెన్సీ ప్రాంతాలు మినహాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఇరవై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది శాతం మాత్రమే బీసీలకు దక్కిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన సరిగ్గా జరిగి ఉంటే కొత్తగూడెం జిల్లాలోనూ బీసీలకు మరింత స్థానాలు వచ్చేవని ఆమె అన్నారు.
రాహుల్ గాంధీ బీసీలను రాజకీయంగా వాడుకున్నారే తప్ప చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆరోపించారు.నాగర్ కర్నూల్ జిల్లాలో ఐదు గ్రామాల్లో ఒక్క ఎస్టీ కుటుంబం లేకపోయినా ఆ స్థానాలను ఎస్టీలకు కేటాయించారని కవిత ఉదాహరణ ఇచ్చారు. రాజకీయ ప్రమేయంతోనే రిజర్వేషన్లు నిర్ణయమయ్యాయని, మంత్రుల ఆదేశాల మేరకు కలెక్టర్లు పనిచేశారని ఆమె సంచలన ఆరోపణ చేశారు.
బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో చోటు లేదని, ప్రతి చోట కాంగ్రెస్ గద్దెలు దించాలని పిలుపునిచ్చారు. అవకాశం ఉంటే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని కూడా సూచించారు.బీసీలు అందరూ జనరల్ స్థానాల్లోనూ నామినేషన్లు వేయాలని కవిత ఆదేశించారు. ప్రతిపక్షం గురించి మాట్లాడకూడదని, మాట్లాడితే తనను టార్గెట్ చేస్తారని జాగ్రత్తగా చెప్పారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి