సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించి ఇటీవలే కొన్ని మార్పులు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసారు. ఇప్పుడు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐసీఎస్ఈ) సైతం 10, 12 తరగతుల పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను సోమవారం బోర్డు విడుదల చేసింది. పలు కారణాల రిత్యా 10వ తరగతి ఎగ్జామ్స్ ను మే 13, 15 తేదీల్లో నిర్వహించబోమని సీఐసీఎస్ఈ తెలిపింది. ఈ ఏడాదిలో పదో తరగతి లో జరగనున్న పరీక్షలకు సంబందించి మార్పులు చేర్పులు జరిగాయి.