గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జూన్ 25 వతేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. భారతదేశ ఏడవ ప్రధానమంత్రిగా 1989 నుంచి 1990 వరకు పనిచేసిన విశ్వానాథ్ ప్రతాప్ సింగ్ జయంతతి కూడా ఈరోజే. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన కులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించి వారి సామాజిక, రాజకీయ, ఉద్యోగా, ఉపాధి, విద్యకు దోహదం చేసిన మహానుభావుడు. అలాగే తన సంగీత ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని పాప్ రారాజుగా కీర్తిగడించిన ప్రముఖ పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ వెళ్లిపోయిన రోజు. హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం
ముఖ్య సంఘటనలు
1932: భారతదేశం మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును (తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్) లార్డ్స్ మైదానంలో ఆడింది.
1975: భారతదేశం లో ఇందిరా గాంధీ, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
1983: భారత్ మొట్టమొదటి సారిగా క్రికెట్ లో ప్రపంచ కప్ (ప్రుడెన్షియల్ వరల్డ్ కప్)ను గెలుచుకుంది.
జననాలు
1878: వఝల సీతారామ శాస్త్రి, భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (మ.1964)
1931: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (మ.2008)
1945: శారద, దక్షిణ భారత సినీ నటి.
1957: ఎన్.గోపి, తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి
మరణాలు
1984: మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్ తత్వవేత్త (జ.1926)
2009: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (జ.1958)
2009: శివచరణ్ మాథుర్, అసోం గవర్నర్ (జ.1926)
2019: మహాస్వప్న దిగంబర కవులలో ఒకరు.
పండుగలు, జాతీయ దినాలు
ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం.