ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్న జోర్డాన్ తాజాగా అమన్ ప్రాంతానికి చెందిన అద్భుతమైన విజువల్స్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, సినిమా షూటింగ్ కోసం లొకేషన్లు ఫైనల్ చేసే పనిలో టీమ్ బిజీగా ఉందని భావిస్తున్నారు. ఈ విజువల్స్ సినిమాకు గ్రాండ్ స్కేల్ను మరింత పెంచబోతున్నాయనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక ఈ సినిమాను మేకర్స్ కేవలం పాన్ ఇండియా మూవీగా కాకుండా, ఒక ఇంటర్నేషనల్ స్థాయి సినిమాగా రూపొందిస్తున్నామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో ఎన్టీఆర్ అభిమానుల ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది. ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ యాక్షన్, పవర్ ఫుల్ కథనంతో ఎన్టీఆర్ను ఇప్పటివరకు చూడని విధంగా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు న్యూ ఇయర్ సంధర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయబోతున్నారట.
ఈ చిత్రంలో కథానాయికగా రుక్మిణి వసంత్ నటిస్తుండగా, ప్రతిష్టాత్మక బ్యానర్లు అయిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్తో రూపొందుతున్న ఈ సినిమా, ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి