దేశీయ మార్కెట్ లో బంగారం పరుగులు తీస్తోంది. ఈ రోజు రికార్డు స్థాయిలో నమోదై సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. పసిడి ధర పెరిగినా.. వెండి ధర పడిపోయింది. కొత్త రికార్డును క్రియేట్ చేస్తూ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర భారీ పెరిగింది. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.640కి పెరగడంతో ధర రూ.54,940కి చేరింది. ఈ ఒక్క రోజే గరిష్ట స్థాయి ధర పలికి రికార్డు బ్రేక్ చేసింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.590 పెరుగుదలతో రూ.50,370 కి చేరింది.


పసిడి ధర వరుసగా ఏడో రోజు వరకు పెరుగుతూ వచ్చింది. దేశీయ మార్కెట్ లో పసిడి పైపైకి ఎగిసినా వెండి ధర భారీగా పడిపోయింది. మార్కెట్ కేజీ వెండి ధర ఏకంగా రూ.2700కు క్షీణించింది. దీంతో ధర రూ.62,000లకు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు పెరగడానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరియు అమెరికా - చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల వల్ల పసిడి పరుగుకు దోహదపడుతున్నాయని నిపుణులు అంటున్నారు.

 బంగారం ధర పెరిగితే మాత్రం వెండి ధర తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించటం లేదంటున్నారు. ఢిల్లీ మార్కెట్ లో పసిడి, వెండి ధరలు భగ్గుమంటున్నాయి.భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర పైపైకి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరగడంతో ధర రూ.52,450కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరగడంతో రూ.51,250కి ఎగిసింది. ఇక కేజీ వెండి ధర మాత్రం రూ.1300 పెరగడంతో రూ.66,000 కి క్షీణించింది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: