మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలను కలిగిస్తాయి. పెసర్లు, నల్ల శనగలు ఇంకా చిక్కుళ్లు వంటి ధాన్యాలను రాత్రంతా కూడా నానబెడితె ఆ మరునాడు ఉదయానికల్లా అవి మొలకలుగా మారతాయి.అయితే ఈ మొలకెత్తిన విత్తనాలను రోజూ తీసుకుంటే కనుక బరువు తగ్గడమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా మనకు లభిస్తుంది.ఇవి తింటే జీర్ణక్రియను మెరుగపరచడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవల్స్ మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కూడా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ డీ ఇంకా అలాగే ఇతర పోషకాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మొలకెత్తిన విత్తనాలు కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి హానీ కూడా చేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం కూడా ప్రమాదమేనట.ఇక ఈ పచ్చి మొలకలలో హానికరమైన బ్యాక్టిరియా అనేది ఉంటుంది. దీనివలన ఏమవుతుందంటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.

మొలకలు తిన్న 12-72 గంటల తర్వాత చాలా మందికి అతిసారం ఇంకా అలాగే పొత్తి కడుపు తిమ్మిర్లు ఇంకా వాంతులు వంటి సమస్యలు కలుగుతాయి. అయితే ఈ సమస్యలు అందరిలో కలగవు.పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఇంకా అలాగే వృద్ధుల విషయంలో ఇది తరచుగా జరుగుతుంది. అయితే కొందరికి మాత్రం ఈ మొలకెత్తిన విత్తనాలు అనేవి అస్సలు పడవు. అలాంటి వారు వీటిని నేరుగా తినకుండా ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి కాసేపు వేయించాలట. ఒక 5-10 నిమిషాలపాటు వాటిని ఉప్పునీటిలో ఉడకబెట్టి తీసుకోవచ్చునట. ఇలా చేసిన ఈ విత్తనాలు జీర్ణవ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తాయి.ఇక వేడి చేసిన మొలకలతో పోలిస్తే పచ్చి మొలకలు జీర్ణం కావడం చాలా కష్టమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే వీటితో వచ్చే పోషకాలను శరీరం తొందరగా గ్రహించదట. కడుపు సంబంధిత సమస్యలు ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉడికించిన మొలకలను తినడం చాలా ఉత్తమం. వీటిని వేడి చేయడం వలన ఇందులోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: