ప్రతి రోజు కూడా సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల వ్యాధులు పెరుగుతాయని సంగతి అందరికీ కూడా తెలిసిందే. అయితే కేవలం ఆహార అలవాట్ల కారణంగా కూడా కొన్ని వ్యాధులు వస్తాయి.అందులో ఎక్కువగా వచ్చే వ్యాధి బోలు ఎముకల వ్యాధి. ఎముకలు బలహీనంగా ఉండటం ఇంకా అలాగే పెలుసుగా మారుతాయి. చిన్నపాటి ఒత్తిడికే విరిగిపోయే ఆ ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి శరీరానికి అవసరమైన కాల్షియంని కూడా అందించాలి. ప్రస్తుత కాలంలో అందరినీ కూడా బోలు ఎముకల వ్యాధి ఎంతగానో వేధిస్తుంది. అయితే వైద్యులకు చూపించడంలో నిర్లక్ష్యం వహించడంతో సమస్య అనేది మరింత పెరుగుతుంది. శరీరంలోని 99 శాతం కాల్షియం ఒక్క ఎముకలకే ఉపయోగపడుతుంది. అలాగే రోజువారీ ఆహారంలో కాల్షియం తగినంతగా లేకపోతే ఎముకల వ్యాధి బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.అందుకే గట్టి బలమైన ఎముకల కోసం శరీరంలో కాల్షియం లెవెల్స్ ను బాగా వృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కచ్చితంగా కాల్షియం సప్లిమెంట్స్ ను తీసుకోవాలి.


కనీసం రోజు 1000 MG కాల్షియం ఆహారం ద్వారా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే అధిక కాల్షియం కూడా కిడ్నీలో రాళ్ల సమస్యను పెంచుతుందని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పాలల్లో అధిక కాల్షియం కంటెంట్ అనేది ఉంటుంది. ఇంకా అలాగే ఆకు కూరల్లో కూడా కాల్షియం అనేది ఉంటుంది. నువ్వుల గింజల్లో కూడా అధిక కాల్షియం ఉంటుంది.ఇక ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్లో 146 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే సోయాబీన్స్, ఆవపిండి ఇంకా అలాగే ఓక్రా వంటి ఉత్పత్తుల్లో కూడా అధిక కాల్షియం ఉంటుంది.కాబట్టి డైలీ ఆహారంలో వీటిని కనుక తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే కాల్షియంని అందించవచ్చు. అయితే ఎముకల సమస్యను నివారించడానికి ఇతర పోషకాలు కూడా శరీరానికి చాలా అవసరం. మెగ్నీషియం, విటమిన్ కే ఇంకా అలాగే జింక్ వంటి పోషకాలు కూడా నిర్ణీత స్థాయిల్లో ఉండేలా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: