ప్రస్తుత కాలంలో బియ్యం అనేది చాలా మందికి ప్రధాన ఆహారంగా మారిపోయింది. కానీ ఒకప్పటి మన పూర్వీకులు అయితే ఎక్కువగా ఈ చిరుధాన్యాలనే ఆహారంగా తినేవారు. అందులో ముఖ్యంగా జొన్నలు, సజ్జలు ఇంకా అలాగే రాగులను చాలా ఎక్కువగా తినేవాళ్లు.ఇక ఎప్పుడైతే బియ్యం పంట ఎక్కువైందో ఆ రుచికి బాగా అలవాటు పడి, చిరుధాన్యాలను పూర్తిగా పక్కన పెట్టారు.దాని ఫలితంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలు పెరిగిపోయాయి. ఇంకా చిరుధాన్యాల వాడకం తగ్గడం, బియ్యం వాడకం పెరగడం కూడా ఒకేసారి జరిగింది. అలాగే జనాలు ఆరోగ్య సమస్యల బారిన పడటం కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా మారిన ఈ ఆహారపు అలవాట్ల వల్ల గుండె సమస్యలు చాలా ఎక్కువైపోయాయి. గుండెకు ఆక్సిజన్ అందక కార్డియాక్ అరెస్టులు ఇంకా గుండెపోటుతో మరణించే వారి శాతం బాగా పెరిగిపోయింది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్లే ఎక్కువగా గుండె వైఫల్యం చెందుతున్నట్టు చాలా రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే సజ్జలతో వండిన ఆహారాలు తినడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


సజ్జలతో చేసిన అన్నం, రొట్టెలు ఇంకా అల్పాహారాలని తినడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు చాలా ఈజీగా బయటికి పోతుందని నిపుణులు చెబుతున్నారు.ఇక సజ్జల్లో ఉండే ఫైటో కెమికల్ రక్తనాళాల్లో కొవ్వును పేరుకుపోనివ్వదు. కొవ్వు పేరుకుపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ఇంకా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సజ్జలను ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువకాలం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇంకా ఈ సజ్జల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణం కూడా ఉంది. అలాగే సజ్జల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ అనేది మీ జీర్ణక్రియ సజావుగా సాగేలా చూస్తుంది. శరీరంలో ఎక్కడా కూడా కొవ్వు చేరకుండా కాపాడే గుణం ఈ సజ్జలకు ఉంది. కాబట్టి మీరు అధిక బరువు బారిన పడే అవకాశం కూడా తగ్గిపోతుంది. అధిక బరువుతో ముడిపడి ఉన్న అనారోగ్యాలు అంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం ఇంకా ఊబకాయం వంటి సమస్యలన్నీ కూడా దూరంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: