ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరిని షుగర్ సమస్య చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే ఈ సమస్య బారిన పడిన వారు ఖచ్చితంగా మంచి ఆహార నియమాలను పాటించాలి. ప్రతిరోజూ మందులను ఖచ్చితంగా వాడాలి.రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. షుగర్ వ్యాధి అదుపు తప్పితే ఖచ్చితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి షుగర్ వ్యాధిని తప్పకుండా నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే ఎటువంటి శ్రమ లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే మసాలా దినుసులతో మనం చాలా ఈజీగా ఈ షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మన ఇంట్లో ఉండే మసాలా దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. ఈ మెంతులు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతాయని చాలా పరిశోధనల్లో వెల్లడైంది. మెంతుల్లో ఫైబర్ తో యాంటీ డయాబెటిక్ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగి తరువాత అలాగే మెంతులను కూడా తినాలి.


అదే విధంగా మెంతి పొడిని మజ్జిగలో లేదా పెరుగులో వేసి కలిపి  తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ఈజీగా నియంత్రణలో ఉంటుంది. అలాగే నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధిని మనం చాలా ఈజీగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు డయాబెటిస్ ను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఈ మిరియాలను పొడిగా చేసి దీనికి సమానంగా పసుపును కూడా కలపాలి.ఇక ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతి రోజు కూడా మూడు గ్రాముల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి కలిపి తాగాలి.భోజనానికి ఒక గంట ముందు ఇలా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్థులు ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: