గడిచిన సంవత్సరం మారుతికి ఏమాత్రం కలిసిరాలేదు. అతడు ఎన్నో అంచనాలతో నాగచైతన్యతో తీసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఊహించిన విజయాన్ని అందుకోలేక పోయింది. అదేవిధంగా ఏకంగా సంవత్సరం గ్యాప్ ఇచ్చిన శర్వానంద్ నటించిన ‘పడిపడి లేచె మనసు’ కూడ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఒకవైపు మారుతి మరొకవైపు శర్వానంద్ ల మార్కెట్ పూర్తిగా పడిపోయింది. 

అయితే ఈ సవత్సరం పరాజయం పొందిన ఈ ఇద్దరూ కలిసి ఒక ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మారుతి స్టైల్ లో ఉండే అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ మూవీకి శర్వానంద్ లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు మారుతి అల్లు అర్జున్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసిన కామెడీ కథకు ఇప్పుడు శర్వానంద్ హీరోగా మారినట్లు టాక్. 
Sharwanand Interview Stills at Telugu Cinema Radha - e3talkies
ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతున్న ఈ ఈసినిమా షూటింగ్ త్వరలో మొదలు కాబోతున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘మహానుభావుడు’ హిట్ అయిన నేపధ్యంలో ఇప్పుడు అదే సెంటిమెంట్ ను కొనసాగించాలని వీరిద్దరూ నిర్ణయించు కున్నట్లు టాక్. 


ప్రస్తుతం శర్వానంద్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ‘పడిపడి లేచె మనసు’ ఫెయిల్యూర్ అనుభవంతో ఈమూవీ స్క్రిప్ట్ లో చాల మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈమూవీ కూడ పరాజయం చెందితే శర్వానంద్ వైపు ఇప్పట్లో మరొక డైరెక్టర్ చూసే అవకాసం లేకపోవడంతో ముందుగానే వ్యూహాత్మకంగా శర్వానంద్ మారుతి ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: