టాలీవుడ్ లో ఒకప్పటి సంచలనం తాప్సి పన్ను. "ఝుమ్మంది నాదం" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. ఈ ఢిల్లీ బ్యూటీ  ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది.

వైవిధ్యమైన స్టోరీస్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే, ఏదైనా సినిమాకు సైన్ చేస్తే వెంటనే ఆ సినిమాకు సంబంధించిన హోమ్ వర్క్ ను ప్రారంభిస్తుంది. తనకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ 33 ఏళ్ళ భామ జిమ్ లోని తన వర్కవుట్స్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో ఎక్కువగా పంచుకుంటోంది.

"పింక్" భామ తన రీసెంట్ మూవీ కోసం కసరత్తులు ప్రారంభించడంతో పాటు ఓ సర్జరీ కూడా చేయించుకుందట. వివరాల్లోకి వెళ్తే, తాప్సి ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న "రష్మీ రాకెట్" సినిమాలో నటించబోతోంది. ఈ సినిమాలోని తన పాత్రకై ఇలా వర్కవుట్స్ తో సిద్ధమవుతోంది.

స్పోర్ట్స్ డ్రామాకు సంసిద్ధమవుతున్న తరుణంలో తాప్సి ఓ సర్జరీ కూడా చేయించుకుంది. వెరికోస్ వెయిన్స్ ను సర్జరీ ద్వారా తొలిగించుకుని ఆ తరువాతే ఈ సినిమాకు సంబంధించిన వర్కవుట్ ట్రైనింగ్ సెషన్స్ లో పాల్గొన్నానని తాప్సి ప్రకటించింది.

ఇదిలా ఉంటే, తాప్సి కామెడీ మూవీస్ పై కూడా దృష్టిపెడతానని ప్రకటించింది. సీరియస్ జోనర్స్ లో మూవీస్ తనకు కొంచెం విసుగును తెప్పిస్తున్నాయని త్వరలో అంటే 2021లో కామెడీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతామని స్టేట్మెంట్ ఇచ్చింది.

అలాగే, తాప్సి ఇండస్ట్రీలో 10 ఏళ్ళ కెరీర్ ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇంతకు ముందు హీరోయిన్స్ కి కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుందని అనుకున్నానని కానీ ఎఫర్ట్స్ పెట్టే కొద్దీ మంచి మంచి రోల్స్ వస్తూనే ఉంటాయని ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కు కొదవే లేదని చెప్పుకొచ్చింది ఈ భామ.

నిజానికి, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ తో బాలీవుడ్ లో తాప్సి దూసుకుపోతోందనే చెప్పుకోవాలి. అమితాబ్ బచ్చన్ వంటి ప్రసిద్ధ నటులతో స్క్రీన్ షేర్ చేసుకునే అమూల్యమైన అవకాశం కూడా అమ్మడిని వరిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: