మరోసారి ఇండస్ట్రీపై కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇక సినిమా షూటింగ్స్ పాల్గొంటున్న నటులు అందరు కరోనా బారిన పడిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ హీరోయిన్ సమీరారెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో ఆదివారం కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ నిర్దారణ పరీక్షలలో ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె భర్త, పిల్లలు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వాళ్ళ టెస్టులకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.

ఈ మధ్యకాలంలోనే సమీరా రెడ్డి తన ఫ్యామిలీతో కలిసి గోవాకు మకాం మార్చారు. ఆమె గత ఆరు నెలలుగా గోవాలోనే నివాసం ఉంటున్నారు. సమీరా రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి జై చిరంజీవ, ఎన్టీఆర్‏తో అశోక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు పరిశ్రమలోనే కాదు.. బాలీవూడ్ లోను వరుస అవకాశాలను స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక రెండవ సారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అలాంటి కామెంట్లను పట్టించుకోలేదని.. మరోసారి అమ్మ అవుతున్నందుకు సంతోషంగా ఉండేదని తెలిపింది. ఇక ఈమెపై నెటిజన్స్ కామెంట్స్ చేసిన బాధపెట్టినా.. తాను పెద్దగా పట్టించుకోలేదని సమీరా చెప్పుకొచ్చింది.



 ఇక కరోనా సమయంతో ఎంతో మందికి సహాయం చేసిన పేదల పాలిట దేవుడిగా నిలిచి అందరి చేత రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. అటు, సినీనటులు అర్జున్ రాంపాల్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇక దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందని ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అభిమానులకు సినీ ప్రముఖులు సూచనలు చేశారు. మిమ్మల్ని నమ్ముకుని కుటుంబాలు ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలని అషురెడ్డి ఈ సందర్భాంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: