ఈ విధంగా చిరంజీవి గురించి విచారణ చేస్తున్న సమయంలో చిరంజీవి హీరోగా నటించిన శంకరాభరణం సినిమా విడుదల కావడంతో ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన మంజు భార్గవి సినిమా ప్రీమియర్ షోకి రావాలనే చిరంజీవిని ఆహ్వానించారని సమాచారం.చిరంజీవితో పాటు అల్లు అరవింద్ కుటుంబాన్ని కూడా ఆహ్వానం రావడంతో వీరందరూ కలిసి సినిమాకి వెళ్లారని తెలుస్తుంది. అసలే చిరంజీవి గురించి విచారణ జరుగుతున్న సమయంలో ఈ సినిమా పెద్ద తలనొప్పి తీసుకు వచ్చిందని సమాచారం.
అందరూ సినిమా చూస్తూ అందులో లీనమైపోయారట. ఆ సినిమాలో క్లైమాక్స్ సీన్ చాలా బాగుంటదట. ఆ క్లైమాక్స్ లో ఎంతో ఎమోషనల్ సీన్స్ ఉండటంవల్ల చిరంజీవి చాలా ఎమోషనల్ అయి ఏడవడం మొదలుపెట్టాడని సమాచారం.అయితే ఎవరైనా చూస్తే బాగుండదు అన్న ఉద్దేశంతో తన జేబులో నుంచి కర్చీఫ్ తీసుకొని కళ్ళు తుడుచుకోబోయారట. ఆ సమయంలో నటి మంజు భార్గవి చూసి ఆమె చీర కొంగును ఇచ్చారని సమాచారం.ఈ విధంగా ఆమె చీర కొంగు చేతిలో పట్టుకున్నప్పుడే థియేటర్లో లైట్స్ ఆన్ అయ్యాయట. అలా లైట్స్ ఆన్ అవ్వడంతో అల్లు కుటుంబం మొత్తం చిరంజీవి వంక చూశారని సమాచారం. ఇక ఆ దెబ్బతో తన గురించి బ్యాడ్ ఒపీనియన్ వచ్చిందని చిరంజీవి అనుకున్నారట.సురేఖతో తన పెళ్లి క్యాన్సిల్ అవ్వడం పక్కా అని ఫిక్స్ అయిపోయారట చిరంజీవి. అయితే ఒక ట్విస్ట్ జరిగిందట. అక్కడ జరిగిన విషయమంతా కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గా అల్లు ఫ్యామిలీ భావించారని సమాచారం. ఆ తరువాత వారు పెళ్లి విషయంలో ఏ విధమైనటువంటి అడ్డంకులు చెప్పలేదని సమాచారం.ఆ తరువాత అన్ని అడ్డంకులు తొలగి పోయి మా పెళ్లి జరిగిపోయిందని ఓ సందర్భంలో మెగాస్టార్ ఈ విషయాలను వెల్లడించారని సమాచారం.